అనకాపల్లి: రైల్వే చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రమేష్

69చూసినవారు
అనకాపల్లి: రైల్వే చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రమేష్
రైల్వే శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శలువతో సత్కరించారు. కీలకమైన రైల్వే శాఖకు చైర్మన్గా బాధ్యతను అప్పగించినందుకు ధన్యవాదాలుతెలిపారు. అనంతరం పార్లమెంట్ భవనం హాల్ లో ఏర్పాటు చేసిన రైల్వే శాఖ కమిటీ మొదటి సమావేశం లో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్