పర్యవరణ పరిరక్షణ పై అవగాహణ ర్యాలీ

84చూసినవారు
పర్యవరణ పరిరక్షణ పై అవగాహణ ర్యాలీ
నెహ్రూ యువ కేంద్రం & అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ మేరకు ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించడం, మొక్కలు నాటడం పై అవగాహన ర్యాలీ చేపట్టారు. విద్యార్ధులు పరిసరాల పరిశుభ్రత, మొక్కలు పరిరక్షణలో భాగస్వాములు కావాలని ప్రిన్సిపాల్ నాయక్ అన్నారు. పెదలబుడు వైస్ సర్పంచ్ చందు నిర్మల, ఎన్వైకే ఆఫీసర్ మహేశ్వరరావు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.

సంబంధిత పోస్ట్