అల్లూరి సీతారామరాజు జిల్లా కురుడి గ్రామ శివాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘అడవి బాట’ కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో పర్యటించి మాట్లాడారు. అరకు గ్రామాన్ని కేరళ తరహాలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఇక్కడ రోడ్లు వేసి డోలీలా మోతకు చరమగీతం పాడుతానని తెలిపారు. అనంతరం స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు.