పేట వద్ద నిలిచిపోయిన రాకపోకలు

55చూసినవారు
చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట వడ్డది మధ్యన గల పెద్దేరు బ్రిడ్జిపై నుంచి వరద నీరు పొంగి పొర్లుతుండడంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే గతంలో ఈ బ్రిడ్జి కూలిపోగా ప్రత్యామ్నాయంగా కాజ్వే నిర్మించినప్పటికీ వరదల మూలంగా నీరు పోటు ఎత్తడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వరద నీరు నిలిచిపోకుండా అధికారులు సత్వర చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్