విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఢిల్లీలో మంగళవారం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఈ తరుణంలో ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ లో కీలక పరిణామాలు చోటుచేసుకోవడంతో సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్టీల్ప్లాంట్ సీఎండీని సెలవుపై వెళ్లాల్సిందిగా కేంద్రం ఆదేశించడం వంటి కీలక పరిణామం చోటుచేసుకోవడం ఈసమావేసానికి ప్రాధాన్యత ఏర్పడింది