ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి సెప్టెంబర్ 30వ తేదీన నోటిఫికేషన్ వెలువడిందని ఆ మేరకు సోమవారం నుంచి ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమయ్యిందని నవంబర్ 6 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.