ఈనెల9న విశాఖలోని వుడా చిల్డ్రన్స్ ఎరీనాలో ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ సోమవారం పేర్కొన్నారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా, జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ ఉగాది వేడుకలకు అందరూ ఆహ్వానితులేనని వివరించారు. పంచాంగ పఠనం, సాంప్రదాయ నృత్యాలు, అర్చకులకు సత్కారం, ఉగాది పచ్చడి పంపిణీ వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు.