మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు మాడుగుల టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ నేత సీఎం రమేష్ కూడా బండారుకే మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. మాడుగుల టీడీపీ టికెట్ను ఇప్పటికే పైలా ప్రసాద్కు కేటాయించారు. కానీ దీనిపై పార్టీ నేతలు పీవీజీ కుమార్, గవిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాంతో ప్రసాద్ను తప్పించి బండారుకు టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం.