మాడుగుల.. మొబైల్ ఆధార్ క్యాంపులు పరిశీలించిన ఎండిఓ

65చూసినవారు
మాడుగుల.. మొబైల్ ఆధార్ క్యాంపులు పరిశీలించిన ఎండిఓ
నాలుగు రోజులపాటు నిర్వహించ తలపెట్టిన మొబైల్ ఆధార్ క్యాంపులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈనెల 22 నుంచి 25వరకు ఈ క్యాంపులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మాడుగుల మండలంలో మాడుగుల వన్, ఎం కోటపాడు, ఒమ్మలి, జలంపల్లి గ్రామాల్లో ఈ శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేంద్రాలను ఎండిఓ కే అప్పారావు సందర్శించి పనితీరును పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు చేస్తూ సకాలంలో పనులు పూర్తయి విధంగా చొరవ చూపాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్