ముగిసిన కోడ్.. తొలగిన ముసుగులు

57చూసినవారు
ఎన్నికల కోడ్ ముగియడంతో నర్సీపట్నంలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలకు తొడిగిన ముసుగులను తొలగించారు. మార్చి 16 నుంచి ప్రారంభమైన ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో నర్సీపట్నం అబీద్ సెంటర్ లో గల రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ మినీ స్టేడియంలోని ఎన్టీఆర్, వైఎస్సార్ విగ్రహాలకు ముసుగులు తొలగించారు. అదే విధంగా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లోని వివిధ రాజకీయ నాయకులకు వేసిన ముసుగులను తొలగింపజేశారు.

సంబంధిత పోస్ట్