ఏయూ ఉద్యోగులు ఒక రోజు మూల వేతనం విరాళం

56చూసినవారు
ఏయూ ఉద్యోగులు ఒక రోజు మూల వేతనం విరాళం
ఆంధ్రవిశ్వవిద్యాలయం బోధన, బోధనేతర ఉద్యోగులు తమ ఒకరోజు మూల వేతనాన్ని వరదబాధితుల సహాయార్ధం ఇవ్వనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య జి. శశిభూషణ రావు బుధవారం తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ పరిసర ప్రాంతాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటం ఏయూ అధికారులు గమనించారు. ఏయూ బోధన, బోధనేతర సిబ్బందితో సమావేశమై అధికారులు దీనిపై చర్చించారు. ఏయూ ఉద్యోగులంతా ఒకరోజు మూలవేతనాన్ని వరద బాధితులకు సహాయం అందించడానికి ముందుకు వచ్చారు.

సంబంధిత పోస్ట్