రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 3న విశాఖ జిల్లాలో జాబ్మేళాలు నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి సాయికృష్ణ చైతన్య ఆదివారం తెలిపారు. పెదగంట్యాడలో గల నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ (నేక్), విశాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ జాబ్మేళాలు నిర్వహించనున్నామన్నారు. పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ చదివినవారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.