నేడు సికింద్రాబాద్ కు వన్ వే స్పెషల్

83చూసినవారు
నేడు సికింద్రాబాద్ కు వన్ వే స్పెషల్
భారీ వర్షాల కారణంగా ఆయా స్టేషన్లో నిలిచిపోయిన ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి సికింద్రాబాద్ కు వన్ వే ఏసీ స్పెషల్ నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డిసిఎం సందీప్ మంగళవారం తెలిపారు. ఈ రైలు బుధవారం రాత్రి 7: 50 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6: 25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని చెప్పారు. ఈ స్పెషల్ రైలు సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు స్టేషన్ లో ఆగుతుంది.

సంబంధిత పోస్ట్