దేవరాపల్లి మండలంలోని వెంకటరాజుపురం గ్రామానికి చెందిన గోకాడ గురువులు, నోడగల పరిదేశి, అల్లి బాబురావుకు చెందిన 15 మేకలపై వీధికుక్కలు దాడి చేశాయి. వీధికుక్కలు దాడి చేసిన కారణంగా పదిహేను మేకలు మృతి చెందాయి. సుమారు రూ. 1. 5లక్షలు వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. మేకలు మృతిపై అధికారులు స్పందించి ఆర్ధిక సాయం చెయాలని పెంపకం దారులు గురువారం కోరారు.