అప్పన్న హుండీ ఆదాయం రూ. 2. 76 కోట్లు

51చూసినవారు
పెందుర్తి నియోజకర‍్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామి వారికి భారీగా హుండీ ఆదాయం సమకూరింది. చందనోత్సవం కూడా ఈ నెలలో కలిసిరావడంతో రూ. 2. 76 కోట్ల ఆదాయం సమకూరింది. నగదుతో పాటు బంగారం, వెండి, పలు దేశాల కరన్సీతో రికార్డు స్థాయి ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. మంగళవారం దేవస్థానంలో సీసీ కెమెరా నిఘాలో ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు.

సంబంధిత పోస్ట్