సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

73చూసినవారు
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
సింహాచలం సింహాద్రి అప్పన్నను ఆదివారం గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అర్చకులు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. సింహాద్రి అప్పనకు విశేష పూజలు, అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించారు. ఆలయ ఈఓ స్వామి జ్ఞాపికను అందజేశారు.

సంబంధిత పోస్ట్