తాము అధికారంలోకి వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. "వాలంటీర్లు రాజీనామా చేయొద్దు.. మీకు అండగా ఉంటాం. మీ జీతం రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచుతాం. మిమ్మల్ని చెడగొట్టాలని సీఎం జగన్ చూస్తున్నారు. అధికారంలోకి రాగానే ఉపాధి కల్పనపై శ్రద్ధ పెడతాం. దొంగలు సృష్టించే నకిలీ వార్తలు నమ్మవద్దు." అని పిడుగురాళ్ల సభలో ఆయన పేర్కొన్నారు.