ఎండలు మండిపోతున్నాయి. అయితే దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు మన దగ్గరే నమోదవుతున్నాయి. ఏపీలోని నంద్యాలలో నమోదైంది. ఈరోజు నంద్యాలలో 44.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో.. దేశంలోనే హాటెస్ట్ సిటీగా నిలిచిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అసన్సోల్, భువనేశ్వర్ 44.6డిగ్రీల ఉష్ణోగ్రతతో రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత కర్నూల్(44.5), అనంతపూర్(43.7), ఝర్సుగుడ(43.65), మహబూబ్నగర్(43.5) ఉన్నాయి.