కూటమి దాడులపై పోరాడుతాం: కొడాలి నాని

68చూసినవారు
ఎన్నికల కౌంటింగ్ అనంతరం వైసీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ నేత కొడాలి నాని విమర్శించారు. 'వైసీపీని అంతం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో అరాచకం సృష్టిస్తున్నారు. పోలీసులు కూడా దాడులు నిలువరించకుండా చోద్యం చూస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించినా స్పందించడం లేదు. కూటమి నేతల దాడులపై పోరాడుతాం' అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్