మూడు కండువాలతో వచ్చే వాళ్లను నమ్మవద్దు: మంత్రి కారుమూరి

55చూసినవారు
మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని, మూడు కండువాలతో వచ్చే నాయకులను నమ్మవద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శనివారం రాత్రి ఇరగవరం మండలంలోని తూర్పువిప్పర్రు, సూరంపూడి, కె. ఇల్లిందలపర్రు, గోటేరు, అంతెనగుంట గ్రామాల్లో ఎస్సీ, శెట్టిబలిజ సంఘాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ వల్లనే అభివృద్ధి జరిగిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్