పాలకోడేరు మండలంలోని శృంగవృక్షం, నందమూరి గరువు గ్రామంలో శనివారం జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు మేకా శేషుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హనుమత్ మహా యజ్ఞంలో ఆయన పాల్గొన్నారు.