పెనుమంట్ర మండలం వెలగలేరుకు చెందిన 11మంది నాయకులు బుధవారం వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మాజీమంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన అభివృద్ధి శూన్యం అని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా 30ఏళ్ల వెనక్కి రాష్ట్రాన్ని నెట్టారని ఆరోపించారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు.