దాళ్వా సాగులో జిల్లాలో అధిక సాగును చేసిన ఎస్ఎల్-10, పీఆర్-126 వరి రకాలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏపీ కౌలురైతు సంఘం డిమాండ్ చేసింది. గురువారం కౌలురైతు సంఘం ఆధ్వర్యంలో పెనుగొండ మండలంలో సంఘం బృందం పర్యటించింది. ప్రభుత్వం ఈ రకాలకు సూపర్ ఫైన్ ధరను నిర్ణయించి కొనుగోలుచేయాలని కౌలురైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే గోపాలన్ డిమాండ్ చేశారు.