భీమవరం చంద్రబాబు హామీలను ప్రజలు ఎప్పటికీ నమ్మరని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. రెండో పట్టణంలోని 33 వ వార్డు తెలుగుదేశం అధ్యక్షులు సిరియాల నాగేశ్వరరావు తన అనుచరులతో సోమవారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.