దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి

80చూసినవారు
భీమవరం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో మంగళవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి క్రాంతి బాబు మాట్లాడుతూ. అర్ధరాత్రి సమయంలో వెంప దళితపేటలపై కత్తులు, కర్రలతో సామూహిక దాడి చేసి, దళిత యువతిపై సామూహిక అత్యాచారయత్నం చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్పీకి వినతిపత్రాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్