ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం అయ్యప్పరాజు గూడెం గ్రామంలో శనివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన బండారు లక్ష్మణరావు (52) విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న ధర్మాజీగూడెం పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు.