దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదపాడు మండలం అప్పనవీడులోని అభయాంజనేయ స్వామికి మంగళవారం పూజలు చేశారు. విజయవాడలో జరుగుతున్న టీడీఎల్పీ సమావేశానికి వెళుతూ మార్గ మధ్యంలో అప్పనవీడులోని అభయాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.