తెలంగాణలో 2022-23లో 710 మందికి హెపటైటిస్-సీ, 435 మందికి హెపటైటిస్-బీ నిర్ధారణ అయింది. గతేడాది కోనసీమ జిల్లాలో 600 హెపటైటిస్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో గత రెండేళ్లలో 2,536 మందికి హెపటైటిస్-బీ వ్యాధి.. అలాగే 1,199 మందికి హెపటైటిస్-సీ వ్యాధి నిర్ధారణ అయింది. వీరిలో అత్యధికులు తెలంగాణలోని గద్వాల, ఐజ, అలంపూర్ వాసులు.. ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపిలి మండల వాసులు ఉన్నారు.