గుడిని ఢీకొట్టిన లారీ

60చూసినవారు
ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ బెంజ్ లారీ స్థానికంగా ఉన్న గంగానమ్మ గుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని 108 లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో గుడి ప్రహరీ గోడ పాక్షికంగా దెబ్బతింది. అయితే నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చు అని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్