కలెక్టర్ ను కలిసిన నరసాపురం కమిషనర్

85చూసినవారు
కలెక్టర్ ను కలిసిన నరసాపురం కమిషనర్
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ నాగరాణిని నరసాపురం మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. అంజయ్య శుక్రవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిషనర్‌గా నియమితులైన ఆయన ఇటీవలే బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ మేరకు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం ఇరువురు పట్టణంలోని పలు అంశాలపై కాసేపు చర్చించుకున్నారు.

సంబంధిత పోస్ట్