యలమంచిలి మండలం ఏనుగువాని లంక గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాలకొల్లు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) తనయుడు సాయి బాలాజీ బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో తన తండ్రికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.