ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలోని బయ్యనగూడెం గ్రామంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చెరుకు ట్రాక్టర్ బోల్తా పడింది. స్థానిక సచివాలయం సమీపంలో ఉన్న మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తీసుకువెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడినట్లు తెలుస్తోంది. సుమారు అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.