జంతువధ, మాంసాహార విక్రయాలు నిషేధం: మున్సిపల్ కమిషనర్

83చూసినవారు
జంతువధ, మాంసాహార విక్రయాలు నిషేధం: మున్సిపల్ కమిషనర్
అక్టోబర్ రెండవ తేదీన మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా జంతువధ, మాంసాహార విక్రయాలు నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకుపట్టణంలోని రెస్టారెంట్లు, భోజన హోటల్స్ యజమానులు మాంసాహార భోజనాల తయారు చేయవద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్