ఎరువుల గోదాముల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు

59చూసినవారు
ఎరువుల గోదాముల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు
తాడేపల్లిగూడెం పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో గురువారం విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శివరామకృష్ణ ఆధ్వర్యంలో వాసా బత్తుల రామకృష్ణకు చెందిన ఎరువుల గోదాములో ఎటువంటి అనుమతులు లేని రూ. 1,82,150 విలువైన 6.40 మెట్రిక్ టన్నుల ఎరువులు, కనకదుర్గ ఫెర్టిలైజర్స్‌లో రూ. 69, 225 విలువైన ఎరువుల వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్