కారులో చెలరేగిన మంటలు

71చూసినవారు
ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లి వద్ద జాతీయ రహదారిపై కారులో సోమవారం పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వెంటనే అప్రమత్తమే కారు నుండి కిందకు దిగిపోయారు. ఈ ఘటనలో కారు పూర్తిగా అగ్నికి ఆహుతయింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదు.

సంబంధిత పోస్ట్