వరద బాధితుల కోసం రైతు, కౌలు రైతు సంఘాల ఔదార్యం

65చూసినవారు
విజయవాడ వరద బాధితుల కోసం రైతు సంఘం, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం కైకరం తూర్పు వీధిలో రైతులు, కౌలు రైతుల కుటుంబాల నుండి విరాళాలు సేకరించి పులిహార ప్యాకెట్లు తయారు చేసి గురువారం విజయవాడ తీసుకువెళ్లారు. తూర్పు వీధి రామాలయం వద్ద నుండి సుమారు 2000 మందికి సరిపడా పులిహార ప్యాకెట్లను వాహనాల ద్వారా విజయవాడకు తరలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం కౌలు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్