ఉంగుటూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

67చూసినవారు
ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో మంగళవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం రైతు భరోసా కేంద్రంలోని సిబ్బందితో మంత్రి మాట్లాడుతూ. రైతులకు సమస్యలు లేకుండా చూసుకోవాలని. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్