AP: రాష్ట్రంలో అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు మాత్రమేనని వైసీపీ ట్వీట్ చేసింది. CBN అబద్దాలు చెప్పడం.. దాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేయడం దశాబ్దాలుగా జరుగుతూనే వస్తోంది అని తెలిపింది. అబద్ధాలను నిజం చేయాలనే వాళ్ల తాపత్రయం అంతా ఇంతా కాదని ఎద్దేవా చేసింది. తాజాగా చంద్రబాబు.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా తానే పేరు పెట్టానని పచ్చి అబద్ధం చెప్పారని.. వాస్తవంగా వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పేరు మార్పు జరిగిందని వైసీపీ తెలిపింది.