AP: పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు(పోలింగ్ కేంద్రం 202)లో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్హౌస్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.