ఏపీ సీఎం జగన్పై రాయి దాడి జరిగిన తర్వాత విజయవాడ టీడీపీ నేత బోండా ఉమా చేసిన సంచలన ట్వీట్ వివాదాస్పదమైంది. ఆందోళనలో ఉన్న వైసీపీ కార్యకర్తలను రెచ్చెగొట్టే విధంగా ఉమా వైఖరి ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాయి ఫొటోతో పాటూ గాయపడిన జగన్ ఫొటోను ట్వీట్ చేసిన బోండా ఉమా ‘కొండ మీద అమ్మవారు.. కొండ కింద కమ్మవారు’ అని క్యాప్షన్ తగిలించారని, కాగా కాసేపటికే ఆయన ఆ పోస్టును డిలీట్ చేశారని వైసీపీ శ్రేణులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.