సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జూలై 1వ తేదీన ఉదయాన్నే లబ్ధిదారులను ఇంటివద్ద పెన్షన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎంపీడీవో జ్యోతి పేర్కొన్నారు. మండల పరిధిలోని 16 సచివాలయాలలో 7009 పెన్షన్లు ఉన్నట్లు ఆమె తెలిపారు. పెన్షన్ పంపిణీకి సంబంధించిన మ్యాపింగ్ పూర్తయినట్లు ఆమె తెలిపారు. ఆయా సచివాలయ పరిధిలోని పింఛన్లు సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు.