ఖాజీపేట మండలం రావులపల్లె గ్రామానికి చెందిన వైకాపా నాయకులు గంగారపు మహేష్ రెడ్డి, బి. ప్రవీణ్, శేఖర్, ఓబయ్య, దేవదాస్, మాజీ ఎంపీటీసీ రవిబాబు వారి అనుచరులు సుమారు 40 కుటుంబాలు శుక్రవారం మైదుకూరు నియోజకవర్గం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి లక్ష్మిరెడ్డి, గంగారాపు ఆది నారాయణ రెడ్డి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.