ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సి. ఐ సురేష్ రెడ్డి పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం పులివెందుల ప్రభుత్వ జూనియర్ కాలేజి నందు విద్యార్థులకు సిఐ. సురేష్ రెడ్డి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సి. ఐ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, సరైన రికార్డ్స్ ను కలిగివుండాలని సూచించారు. వాహనాదారుడు తప్పకుండా హెల్మెంట్, సీట్ బెల్ట్ ధరించాలన్నారు.