
టీడీపీ ఎమ్మెల్యే విజయశ్రీకి స్వల్ప గాయం
AP: సూళ్లూరుపేట టీడీపీ మహిళా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ స్వల్పంగా గాయపడ్డారు. ఆమె ఊరందూరు గ్రామంలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో విజయశ్రీ అక్కడ గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే, ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుని, చికిత్స చేయించుకుని తిరిగి నాయుడుపేటకు చేరుకున్నారు. ప్రస్తుతం, ఎమ్మెల్యే ఆరోగ్యం మెరుగ్గానే ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.