AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 13 కంపార్ట్మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం స్వామి వారిని 73,543 మంది దర్శించుకోగా.. 25,543 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.