వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. వక్ఫ్ సవరణ చట్టంలోని అనేక నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో దాదాపు 10 పిటిషన్లను విచారించనుంది. ఈ పిటిషనర్లలో లోక్సభ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ తో పలువురు నేతలు ఉన్నారు.