విద్యార్థులకు కేంద్రం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో మరో 4 వేల సీట్లు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కటాఫ్లో మార్పు జరిగి మరికొందరు విద్యార్థులకు అవకాశం కల్పించనుందని నిపుణులు చెబుతున్నారు. కంప్యూటర్ కోర్సుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో 15 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.