ఇంటర్ లో 470కి 466 మార్కులు.. విద్యార్థి అకాల మరణం

10968చూసినవారు
ఇంటర్ లో 470కి 466 మార్కులు.. విద్యార్థి అకాల మరణం
ఇటీవల ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 470కి 466 మార్కులు సాధించిన శ్రీవత్సవ్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో మరణించాడు. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సుతారి శ్రీవత్సవ్ (18) ఈ నెల 7న అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్చారు. బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ కారణంగా గుండె, బ్రెయిన్, కిడ్నీలు పని చేయడం మందగించి నిన్న (సోమవారం) ప్రాణాలు కోల్పోయాడు. చదువులో రాణించినా.. విధి కనికరించలేదని పలువురు కంటతడి పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్