హజ్ యాత్రలో 1,300 మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో 83 శాతం మంది చట్టవిరుద్ధంగా వచ్చినవారేనని, వారు ఉండడానికి హోటళ్లు, గూడారులు సహా ఎలాంటి వసతులు లేవని, 49 డిగ్రీల ఎండతాపం నుంచి కాపాడుకునేందుకు అవకాశం లేక మరణించినట్లు సౌదీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహద్బిన్ అబ్దుర్రహ్మాన్ తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతులను గుర్తించడం సంక్లిష్టంగా మారినట్లు వెల్లడించారు.