హజ్ యాత్రలో 90 మంది భారతీయులు మృతి

80చూసినవారు
హజ్ యాత్రలో 90 మంది భారతీయులు మృతి
హజ్ తీర్థ యాత్ర కోసం ఈ ఏడాది వెళ్లిన వారిలో 90 మంది భారతీయులు మరణించారని అధికారులు తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 645 మంది మృతి చెందారు. వీటిలో అత్యధిక మరణాలు వడదెబ్బ కారణంగానే జరిగినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 18.3 లక్షల మంది హజ్ యాత్రకు హాజరయ్యారు. మక్కాలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరడంతో వృద్ధులు వేడికి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరై చనిపోతున్నారు.

సంబంధిత పోస్ట్